Devotional | రేపే బల్కంపేట ఎల్ల‌మ్మ అమ్మ‌వారి క‌ల్యాణం – ఏర్పాట్ల‌పై ఎమ్మెల్యే త‌ల‌సాని స‌మీక్ష

హైద‌రాబాద్ – ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా బల్కంపేట (Balkampety ) ఎల్లమ్మ అమ్మవారి (ellamma ammaari ) కళ్యాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ (sanatnagar ) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (mla talasani yadav ) ఆల‌య అధికారుల‌ను కోరారు. అమ్మవారి కళ్యాణం రేపు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఆలయ పరిసరాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎంతో వైభవంగా అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిర్వహించే వారని, చాలా మంది భక్తులకు కళ్యాణం చూసే అవకాశం ఉండేది కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం బయట భారీ షెడ్డును నిర్మించి భక్తులు అందరూ వీక్షించే విధంగా షెడ్డు క్రింద కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు. అనేకమంది దాతలు అల్పాహారం, భోజనం అందిస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. గత సంవత్సరం కళ్యాణంలో ఏర్పడిన ఆటంకాలు, ఇబ్బందులు ఈ సంవత్సరం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆలయం వద్దకు రాలేకపోయిన భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కళ్యాణానికి ఒక్క ఇంకా ఒక్క రోజే ఉన్నా ఇంకా కళ్యాణం టికెట్ లు, వాలంటీర్ ల పాస్ లు, మీడియా ప్రతినిధులకు పాస్ లు ఇవ్వలేదని, వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

మీడియా పాయింట్ ను యధావిధిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గడిచిన10 సంవత్సరాల నుండి ఉన్న విధానాలనే కొనసాగించాలని, కొత్త పద్ధతులను తీసుకొచ్చి విమర్శలకు గురికావద్దని హెచ్చరించారు. ఎంతో పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా, అందరి భాగస్వామ్యం తో జరిగేలా చూడాలని చెప్పారు. ప్రశాంత వాతావరణం లో కళ్యాణం జరిగే విధంగా షీ టీమ్ లు, మఫ్టీ పోలీసు లను నియమించాలని అన్నారు. భక్తులకు అందించేందుకు వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకేట్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక 2 వ తేదీ బుధవారం నిర్వహించే రధోత్సవం కూడా ప్రశాంతంగా ఘనంగా జరిగేలా చూడాలని, ఎలాంటి ఆంక్షలు విధించవద్దని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో మహేందర్ గౌడ్, అన్నపూర్ణ, సూపరింటెండెంట్ హైమావతి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, సురేష్ గౌడ్, కూతురు నర్సింహ, రాజేష్, బలరాం, శేఖర్, గోపిలాల్ చౌహన్, భూపాల్ రెడ్డి, ఆకుల రాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply