న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి అనారోగ్య కారణాల వల్ల ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆమె ప్రస్తుతం గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.
అయితే, సోనియా గాంధీ ఈ సంవత్సరం ఉదర సంబంధిత సమస్యలకు చికిత్స పొందడం ఇది రెండోసారి. జూన్ ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కొంతకాలం ఆమె వైద్య చికిత్స పొందిన విషయం తెలిసిందే.