Cricket |రెండో వన్డేలో ఇంగ్లంద్ దే విజయం …

లార్డ్స్ వేదిక‌గా భారత్‌, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య జ‌రిగిన రెండో వన్డేలో ఆతిథ్య జ‌ట్టు విజ‌యం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ వన్డేలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని న‌మోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. మొద‌ట టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా ప్రారంభ‌మైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.

ఇక‌, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త జ‌ట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. టీమిండియాను కట్టడి చేయడంలో ఇంగ్లండ్ బౌల‌ర్లు సఫలమ‌య్యారు. ఎకల్‌స్టోన్‌(3/27), అర్లాట్‌(2/26), లిన్సె స్మిత్‌(2/28) ధాటికి భార‌త్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మందన(42), దీప్తిశర్మ(30 నాటౌట్‌) రాణించారు. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు.

కాగా, వర్షం అంతరాయంతో ఇంగ్లండ్ ల‌క్ష్యాన్ని 24 ఓవర్లకు 115 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను ఆతిథ్య జ‌ట్టు 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో అమీ జోన్స్‌(46 నాటౌట్‌), టామీ బ్యూమౌంట్‌(34) బ్యాట్ ఝుళిపించారు. టీమిండియా బౌల‌ర్ల‌లో క్రాంతిగౌడ్‌, స్నేహ్‌రానా ఒక్కో వికెట్‌ తీశారు.

aసంక్షిప్త స్కోర్లు
భారత్‌: 29 ఓవర్లలో 143/8 (మందన 42, దీప్తిశర్మ 30 నాటౌట్‌, ఎకల్‌స్టోన్‌ 3/27, అర్లాట్‌ 2/26).
ఇంగ్లండ్‌: 21 ఓవర్లలో 116/2 (జోన్స్‌ 46 నాటౌట్‌, బ్యూమౌంట్‌ 34, స్నేహ్‌రానా 1/12, క్రాంతి 1/29)

Leave a Reply