పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రైతులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడిని రైతులు చితకొట్టిన సంఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి లో బుధవారం చోటుచేసుకుంది. నిమ్మనపల్లి లో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కాంగ్రెస్ నాయకుడు కుమార్ రైతులతో దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించిన రైతులు సదరు నాయకుడికి దేహశుద్ధి చేశారు. పోలీసుల సమక్షంలోనే అధికార పార్టీ నాయకుడిని చితక్కొట్టారు.
TG | కాంగ్రెస్ నాయకుడికి దేహశుద్ధి.. నిమ్మనపల్లి లో చితక్కొట్టిన రైతులు
