Committee | పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాది

Committee | పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాది


Committee | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు వివిధ కార్యక్రమాల నిమిత్తం పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వనరులే అత్యంత ప్రధానం. అందుకే గ్రామ ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన పం చాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికారు. రాజస్థాన్లో మొదట అమలైన ఈ వ్యవస్థ.. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విస్తరించింది.

పల్లె పాలనను బలపర్చేందుకు పం చాయతీల నుంచి మూడు శాఖలను వేరు చేసి గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, వసతి వంటి 15 కీలక శాఖలను జీపీల పరిధిలోకి చేర్చారు. సర్పంచ్ ఆధ్వర్యంలోని ఈ వ్యవస్థ గ్రామాలకు స్వయం పాలన అందించే ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో 65 ఏళ్లు దాటి 66వ సంవత్సరంలోకి అడుగిడిన పంచాయతీ శాఖ ప్రయాణం పై పల్లెపాలన గుర్తు చేస్తూ ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

పంచాయతీరాజ్ గొడుగు కింద 29 శాఖలు గ్రామ పంచాయతీ పరిధిలో 15 శాఖలు పని చేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కింద రెవెన్యూ మినహా మొత్తం 29 శాఖలు ఉండగా, 15 శాఖలు మాత్రమే ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. నేటికీ వంద శాతం బదలాయింపు జరగలేదు.

గ్రామపంచాయతీ కార్యాలయం
ప్రధానంగా విద్యుత్, వైద్యం, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్య, తాగు నీరు, పారిశు ద్ధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పశువైద్యం, పౌరసరఫరాలు, రోడ్ల భవనాలు, మత్స్య శాఖ, గృహనిర్మాణం, ఇరిగేషన్ శాఖలు గత కొంతకాలం వరకు కొనసాగాయి.

పంచాయతీల్లో సేవలందించేది ఎవరు?
పంచాయతీల్లో గ్రామపాలన కొనసాగించడానికి వీరంతా చాలా ముఖ్యం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పం చాయతీ కార్యదర్శి, కారోబార్ సేవ క్షేత్రస్థాయిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలన, గ్రామీణాభివృద్ధి ఈజీఎస్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలు, శానిటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, తాగునీరు, గ్రామీణాభి వృద్ధి, రహదారులు, సామాజిక భద్రత, పెన్షన్ విభాగం, గ్రామ స్థాయి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖ, పశుసంవర్ధక శాఖ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్వాడీ ఆయాలు.. వీరంతా నిత్యం గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు. వీరంతా పంచాయతీ పాలనకు జవాబుదారీగా ఉంటారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ (45) ప్రకారం జీవో 138 పీఆర్ ప్రకారం తాగునీరు, సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ.. వంటి సేవలు అందిస్తున్నారు. అలాగే వంతెనలు, కల్వర్టులు, రహదారుల పునరుద్ధరణ తదితర మరమ్మతుల నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో విద్యుత్ సరఫరా అందించాలి. డ్రైనేజీ, వర్షపునీరు నివాస ప్రాంతాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీల పై ఉంటుంది. శానిటేషన్ నిర్వహణలో పంచాయతీల పర్యవేక్షణ చాలా కీలకం. ప్రధాన కూడళ్ల లో కుండీల ఏర్పాటు, తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. సామూహిక మరుగు దొడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత కీలకం. వీటితో పాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలికంగా ప్రజావసరాలను చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాల ధ్రువీకరణ నమోదు, వరదనీరు, తాగునీటి పరిరక్షణ తదితర అంశాలను పంచాయతీలే పర్యవేక్షించాలి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం గ్రంథాల యాల నిర్వహణ, దివ్యాంగులు, నిరాదరణకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రోత్సాహం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. 1959లో పంచాయతీల ఆవిర్భావంలో రెవెన్యూ మినహా అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు ఉండడంతో సర్పంచ్లదే పై చేయిగా ఉండేది. సర్వాధికారాలు సర్పంచ్లకే ఉండడంతో వివిధ శాఖల అధికారులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో స్వయం ప్రతిపత్తి హోదా కావాలని వ్యవసాయం, విద్యుత్, విద్యాశాఖ అధికారులు పట్టుబడ్డారు. దీంతో మూడు శాఖలతో పాటు ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో నుంచి విడిపోవడంతో ప్రత్యేక శాఖలుగా ఆవిర్భవించాయి. దీంతో పంచాయ తీరాజ్ వ్యవస్థలో సర్పంచు పాత్ర నామమాత్రంగా మారిపోయింది.

Leave a Reply