ఎక్స్ ఖాతా ద్వారా తెలిపిన సీఎం చంద్రబాబు
తిరుమల, వెబ్ డెస్క్ : కలియుగ దైవమైన తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
ఆదివారం నాటి పరమ పవిత్ర గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారికి మంచి అనుభూతిని మిగిల్చారని సిబ్బందిని కొనియాడారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు చంద్రబాబు.
తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ఖాతాలో తన ఖాతాలో పేర్కొన్నారు.