Sunday, September 8, 2024

విరూపాక్ష – న‌టిన‌టుల ప‌రిచ‌యం

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మిస్టీక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శ కుడు. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తు న్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఏప్రిల్‌ 21న విడుదల చేయ డానికి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్ర మంలో చిత్రయూనిట్‌ పాల్గొంది.

తొలుత సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ”2019లో ఈ కథ విన్నాను. సుకుమార్‌ గారు కదా?.. ఏదో లవ్‌ స్టోరీ చెబుతా రని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్‌ కార్తీక్‌. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని అప్పుడే ఫిక్స్‌ అయ్యా ను. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సునీల్‌, సాయిచంద్‌, బ్రహ్మాజీ, అజయ్‌, సం యుక్త ఇలా అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నన్ను సపోర్ట్‌ చేసిన విరూపాక్ష టీ-ం, సుకుమార్‌ గారికి థాంక్స్‌. ఈ సినిమాకు కథే హీరో. హారర్‌ సినిమా చూడటమే ఓ చాలెం జింగ్‌. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్‌. ఓ ఫిక్షన్‌ స్టోరీ అందరి కీ రీచ్‌ అవుతుం దని పాన్‌ ఇండియాలో రిలీజ్‌ చేసు న్నాం. అన్నారు.

దర్శకు డు కార్తిక్‌ దండు మాట్లాడుతూ.. ఈ సినిమా కథను 2018లో రాశాను. రంగస్థలం షూటింగ్‌లో ఉన్న సుకుమార్‌ గారికి ఈ కథను చెప్పాను. -టె-క్నీషియన్స్‌ అందరికీ రుణపడి ఉంటా ను. టీ-ం అంతా కూడా ఎంజాయ్‌ చేస్తూ సిని మాను చేశాం. అని అన్నారు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎప్పుడూ కథను నమ్మే సినిమాలు చేశాను. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అందుకే పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నామని అన్నారు.

నటు-డు సాయిచంద్‌, సంయుక్త మీనన్‌ , బ్రహ్మాజీ , శ్యామల , అభినవ్‌ , అజయ్‌, కెమెరామెన్‌ శ్యాందత్‌ . ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్ర తదితరులు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement