హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం షారుఖ్తో ‘ధక్ ధక్ ’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీని తాప్సీ స్వయంగా నిర్మిస్తున్నది.. ఈ మూవీకి . తరుణ్ దుడేజా దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే.. ఢిల్లీ నుండి హిమాలయాల్లోని ఖర్దుంగ్లా వరకు బైక్ ట్రిప్లో కలిసి వెళ్లే వివిధ రంగాలకు చెందిన నలుగురు సాధారణ మహిళల చుట్టూ ఈ సినిమా స్టోరి ఉండనుంది. ఇక వీరంతా థ్రిల్లింగ్ రైడ్ను ఎంజాయ్ చేయబోతున్నారని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రత్నా పాఠక్ షా , ఫాతిమా సనా షేఖ్ , దియా మీర్జా సంజనా సంఘ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.