Friday, October 4, 2024

TG | ‘భారతీయుడు 2’ టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

భారతీయుడు 2 సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 పెంపునకు అనుమతించింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.

ఈ వారం థియేటర్లలో ఐదవ షో ప్రదర్శనను కూడా అనుమతించింది. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2ను రూపొందించారు. ఈ సినిమా జులై 12న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement