Saturday, July 6, 2024

‘మర్యాద రామన్న’ సిక్వెల్‌.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్‌!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా 2012లో వ‌చ్చిన‌ చిత్రం సన్నాఫ్‌ సర్దార్‌. అజయ్‌ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్‌ దత్‌ లీడ్‌ రోల్స్‌లో అశ్వినీ ధీర్‌ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్‌ సర్దార్‌’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’ చిత్రం రానుందని సమాచారం.

తొలి భాగంలో లీడ్‌ రోల్స్‌లో నటించిన అజయ్‌ దేవగన్, సంజయ్‌ దత్‌ సీక్వెల్‌లోనూ నటించనున్నారని, హీరోయిన్‌గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్‌లో జరిపేలా ప్లాన్‌ చేశారట.

ఈ షెడ్యూల్‌ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్‌ దేవగన్‌-మృణాల్‌ ఠాకూర్‌ల కాంబినేషన్‌ ట్రాక్‌ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్‌. ఈ సినిమాకు అజయ్‌ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement