Friday, October 4, 2024

Dhoom Dhaam సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

కాగా, “ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మాయా సుందరి..’ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ పాట ఛాట్ బస్టర్ అయ్యింది. ఇక‌ ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement