Friday, September 6, 2024

Rashi Khanna : మ‌హాకాళేశ్వ‌రుడి సేవ‌లో రాశీఖ‌న్నా…

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని హీరోయిన్‌ రాశీ ఖన్నా , బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాశీ ఖన్నా మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొన్నారు. కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశీ ఖన్నా అన్నారు. మహాకాల్ మమ్మల్ని మళ్లీ పిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతని నటి వాణీ కపూర్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement