Tuesday, September 17, 2024

Cinema | రావు ర‌మేష్ భావోద్వేగం…

నటుడు రావు రమేష్ భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాని పలువురు ప్రేక్షకులతో రామానాయుడు స్టూడియోలో చూశారు. షో పూర్తయ్యాక దర్శకుడు లక్ష్మణ్‌ను అభినందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

వందల చిత్రాల్లో నటించిన రావు రమేశ్‌.. అలా ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి గురికావడంతో దర్శకుడు లక్ష్మణ్ సైతం ఎమోషనల్‌ అయ్యారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథతో రూపొందించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement