Tuesday, July 23, 2024

Mumbai | అంబానీ ఇంట పెళ్లి…. ముంబైలో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి రేపు గ్రాండ్ గా జరగబోతోంది. గత ఐదు నెలల నుంచి ఈ పెళ్లి హడావిడి నడుస్తోంది. అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకని ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ముఖేష్ అంబానీ చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ కూడా సెలక్టివ్ గానే అతిధులని ఆహ్వానిస్తూ ఉంటారు.

ఈ పెళ్లి వేడుకకి సౌత్ లో అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం లభించింది. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండటం విశేషం. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకకి హాజరుకాబోతున్నాడు. దీని కోసం ఇప్పటికే రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ముంబై చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement