Wednesday, October 16, 2024

Raj Tarun | హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ తరుణ్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : హీరో రాజ్‌తరుణ్‌ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సినిమా షూటింగ్స్‌ వల్ల రాలేకపోతున్నానంటూ రాజ్‌తరుణ్‌ కొంత సమయం అడిగిన విషయం తెలిసిందే. తాజాగా లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో రాజ్‌ తరుణ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం నార్సింగ్‌ పోలీసుల ఆదేశాలు తీసుకున్న తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలుపుతూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement