Wednesday, October 9, 2024

Pooja Hegde | మ‌ళ్లీ బుట్ట‌బొమ్మ జోరు.. వరుస మూవీల‌లో బిజిబిజీ !

హీరోయిన్ పూజా హెగ్డేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన పూజ.. ఆ తర్వాత ఒక్కసారిగా అవకాశాలు అందుకున్నారు. అరవింద సమేత, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ సాధించారు.

దీంతో ఆమె కెరీర్ కు తిరుగులేదు అనుకున్న సమయంలో ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. గతేడాది కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించినా.. మళ్లీ నిరాశే ఎదురైంది.

దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోయారు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ షాహిద్ క‌పూర్‌ తో చేస్తున్న యాక్ష‌న్ మూవీ దేవాను ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

రీసెంట్ గా విజయ్ 69 ప్రాజెక్టు గాను మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మళ్లీ వరుస హిట్స్ అందుకుని.. తన టాలెంట్ ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు పూజా హెగ్డే. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. మళ్లీ ఆమె వరుస ఛాన్సులు దక్కించుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement