Friday, September 20, 2024

Nivetha Thomas | ఇద్ద‌రి పిల్ల‌ల త‌ల్లిగా నివేదా !

తెలుగు, మలయాళం, తమిళం సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది నటి నివేదా థామస్. తెలుగులో నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా… మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కూడానాని ‘నిన్నుకోరి’ సినిమాతో మరోసారి మెప్పించింది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా… ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

చివరిసారిగా 2022లో వచ్చిన ‘షాకిని డాకిని’ సినిమాలో కనిపించింది. కానీ ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ’35-చిన్న కథ నహీ’. హీరో రానా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నివేదా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నివేదా.

తాను అన్ని రకాల పాత్రలు చేయగలనని చెప్పడానికే ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించానని వెల్లడించింది. ఈ సినిమా తన తదుపరి సినిమాలపై ప్రభావం చూపుతుందని తెలిసినా ఆ పాత్ర నచ్చడంతో అలా చేశానని చెప్పుకొచ్చింది. ఒకే తరహా పాత్రలు కాకుండా అన్ని పాత్రలు చేసినప్పుడే పూర్తి స్థాయి నటిగా గుర్తింపు వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement