Tuesday, September 17, 2024

Chiranjeevi | వీరాభిమానికి చిరంజీవి సత్కారం..

తిరుపతి జిల్లాకి చెందిన చిరంజీవి వీరాభిమాని ఈశ్వరయ్య.. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెట్ల మార్గంలో పొర్లుదండాలు పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాల‌ని తిరుమల తిరుమల వెంటేశ్వరస్వామిని ప్రార్థించారు.

కాగా, ఈశ్వరయ్య గురించి తెలుసుకున్న చిరంజీవి…. హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడారు. ఈశ్వరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పట్టువస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement