Friday, September 6, 2024

Lavanya – ఆత్మహత్య చేసుకుంటున్నా – అర్ధరాత్రి హై డ్రామా

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో అర్ధరాత్రి మరో హైడ్రామా నడిచింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ డయల్ 112కు , తన లాయర్ దిలీప్ సుంకర కు అర్థ రాత్రి కాల్ చేసింది లావణ్య. దీంతో దిలీప్ పోలీసు లకు సమాచారం ఇచ్చారు . హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఆమెను రక్షించారు బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు

.

ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీస్ కు స్వాదీనం చేసుకున్నారు. ఆ లేఖలో ..

ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను.నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు .నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు.రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు .మైండ్‌ గేమ్‌, గాసిప్స్‌తో విసిగిపోయాను. మస్తాన్‌ కేసులో నేను కీలు బోమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను.. కానీ మాల్వి నిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్‌తరుణ్‌, అతని తల్లిదండ్రులే.నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వీ మలోత్రా. నాకు తినడానికి తిండి లేదని మొత్తుకుంటున్నా. రాజ్‌తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఎంజాయ్ చేస్తోంది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మోజులో పడి మారిపోయాడు. రాజ్‌తరుణ్‌ నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement