Wednesday, October 2, 2024

న్యాయం కావాలని పీఎస్ కి వెళ్లిన జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ వినోద్ ఓ వివాదంలో పోలీసులను ఆశ్రయించాడు. వినోద్ గతంలోనూ ఓసారి ఇంటి యజమాని తీకెపై విసిగిపోయి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పట్లో వినోద్ పై దారుణమైన రీతిలో దాడి జరిగింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసినా కాచిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డికి మొరపెట్టుకున్నాడు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తానని చెప్పిన యజమాని తన నుంచి రూ.13.40 లక్షలు అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాడని వినోద్ వెల్లడించాడు. రూ.40 లక్షలకు ఇంటి బేరం కుదిరిందని, అయితే, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెల్లిస్తేనే ఇంటిని అమ్ముతానని, లేకపోతే అడ్వాన్స్ కూడా తిరిగివ్వనని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని జబర్దస్త్ వినోద్ డీసీపీకి వినతిపత్రం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement