Wednesday, September 18, 2024

Susheela | రేపు డిశ్చార్జి కానున్న సింగ‌ర్ సుశీల..

లెజెండరీ సింగర్ పి.సుశీల కడుపునొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే. వైద్యులు కిడ్నీ సమస్యగా గుర్తించి చికిత్స అందించారు. కాగా, ప్రస్తుతం సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక‌ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని వైద్యులు తెలిపారు.

పి.సుశీల 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. 1950 నుంచి 1990 వరకు 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పి.సుశీల పాడారు. పి.సుశీలను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. పైగా ఉత్తమ గాయనిగా 5 నేషనల్ అవార్డులను కూడా పి.సుశీల అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement