Friday, September 20, 2024

SOLD OUT | ఇంద్ర రీ-రిలీజ్.. క్షణాల్లో హైస్ ఫుల్ !

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయాలని వైజయంతి నిర్ణయించారు. ఈ రీరిలీజ్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. కాగా, ఇంద్ర రీ-రిలీజ్ బుకింగ్స్‌లో ఇప్పటికే చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి.

హైదరాబాద్‌లోని సంధ్య, శ్రీరాములు, భ్రమరాంబ వంటి థియేటర్లో వేసిన షోలకు సంబంధించిన టికెట్లు క్షణాల్లో అమ్ముడు పోయాయి. ఏపిలోనూ చాలా చోట్ల ఇలానే టికెట్లు క్షణాల్లో సేల్ అవుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఇంద్ర రీ రిలీజ్‌ని వైజయంతీ మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నెటిజన్ల నుండి డిమాండ్ కారణంగా, మరిన్ని స్క్రీన్లు, షోలు యాడ్ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement