Sunday, September 22, 2024

అఖండ కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. అఖండ రిలీజ్ కు ఓ ప్రముఖ ఓటిటి సంస్థ భారీ ఆఫర్ ను ఇచ్చిందట. దాదాపు 65 కోట్ల పైగా ఆఫర్ చేసిందని సమాచారం. అయితే దర్శక నిర్మాతలు మాత్రం అందుకు నో చెప్పారట. థియేటర్స్ లోనే రిలీజ్ కి సై అంటున్నారట. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహం, లెజెండ్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement