Friday, October 4, 2024

లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరోయిన్ మాల్వీ…

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కుటుంబం నుంచి తనకు ప్రాణ హాని ఉందని నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాల్వీ కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని… రాజ్ తరుణ్‌ తనతో ప్రేమాయణం కొనసాగించి తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మాల్వీ కుటుంబ సభ్యులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, రాజ్ తరుణ్‌తో పాటు పలువురిపై ఆరోపణలు చేసిన లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది.

తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అలాగే, లావణ్య చేసిన ఆరోపణలపై మాల్వీ స్పందించింది. తాను లావణ్యను బెదిరించలేదని… రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాల్వీ చెప్పింది. రాజ్ తరుణ్ కేవలం తన సహనటుడు మాత్రమేనని తెలిపింది. అలాగే, లావణ్యతో తనకు ఎలాంటి పరిచయమూ లేదని చెప్పింది. రాజ్ తరుణ్ తో నటించే ప్రతి హీరోయిన్ నూ లావణ్య అనుమానిస్తోందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement