Saturday, September 7, 2024

Janhvi Kapoor | హాస్పిటల్ నుంచి హీరోయిన్ జాన్వీ డిశ్చార్జ్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు బోనీకపూర్ వివరాలు వెల్లడించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుసగా మూవీస్‌లో నటిస్తూ జాన్వీ బిజీగా ఉంది. గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘ఉలఝ్‌’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంది. మరోవైపు, ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తోన్న దేవర సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement