Friday, September 20, 2024

Hero రాజ్ త‌రుణ్ కు ముంద‌స్తు బెయిల్ మంజూరు….

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో త‌రుణ్ పై ఫిర్యాదు చేసింది..దీనిపై రాజ్ త‌రుణ్‌పై కేసు న‌మోదు చేసి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరారు పోలీసులు . ఈ నేప‌ద్యంలో త‌రుణ్ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు.. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం అత‌డికి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే.. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement