Tuesday, September 24, 2024

TG | ప్రేమ పేరుతో మోసం.. యూట్యూబ‌ర్ హ‌ర్ష‌సాయిపై కేసు న‌మోదు…

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ… ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు న్యాయవాదితో కలిసి నార్సింగి పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అతడిపై యువతి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

అయితే, తాజాగా హ‌ర్శ‌సాయి మెగా అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెడుతున్నాడు. హర్శ‌సాయి స్వ‌యం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు బాలచంద్ర సహనిర్మాత. కాగా, బాధితురాలికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. హర్ష సాయితో కలిసి మెగా సినిమా నిర్మించింది బాధితురాలు. ఇప్పుడ ఆమే అతడిపై ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement