Monday, September 16, 2024

Kangana | ఎట్టకేలకు ఎమర్జెన్సీ సెన్సార్ పూర్తి…

బాలీవుడ్ నటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో లేదా వాటి స్థానంలో కొత్తవి యాడ్ చేయాలని మూవీ యూనిట్​కు సూచించింది.

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ నటులు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. సెప్టెంబర్ 6న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement