Monday, September 23, 2024

వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..

జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పాడు. మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శారద.. వేణుస్వామిపైన మాత్రమే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement