Thursday, September 12, 2024

Bigg Boss | రేప‌టినుంచే బిగ్‌బాస్ సీజన్-8 !

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో బాగా పాపుల‌ర్‌ అయింది. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షోకు సంబంధించి కీలక అప్టేట్ వచ్చింది.

షోలో ఈసారి ఎంత మంది పాల్గొంటున్నారు? ఫస్ట్ ఫేజ్ లో ఎంత మంది లోపలికి వెళతారు? ఎవరెవరు కన్పర్మ్ అవుతారు? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు చెలరేగుతున్నాయి.

ఫ‌స్ట్ పేజ్‌లో 14 మంది..

సాధారణంగా బిగ్ బాస్‌లో ఎప్పుడూ 15 మందికి పైగా కంటెస్టెంట్లు ఉంటారు. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి ఫేజ్ లో 14 మందిని పంపిస్తున్నారు. 15 వారాల షోకి 14మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది.

దాదాపు అయిదు నుంచి ఆరుగుఇరిన హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. తన ఇన్‌స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన బేబక్క, హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ఢీ నైనిక, కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తొంది. అలానే శేఖర్ బాషా, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ గా భావిస్తున్నారు.

- Advertisement -

వీళ్ల‌కు చాన్స్ లేదా?

తొలుత రీతూ చౌదరి, తేజస్విని గౌడ, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పీ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరు ఎవరూ హౌస్ లోకి వెళ్లడం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement