Sunday, September 8, 2024

Bandla Ganesh | అస్వస్థతతో అపోలో చేరిన బండ్ల గణేష్..

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరారు. ఉదయం నుంచి శ్వాసకోశ, ఇతర సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ‘‘అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాం.. కొంత ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యాడు.. రేపటిలోగా డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

అయితే తీవ్ర అనారోగ్యంతో బండ్ల గణేష్ హాస్పిటల్‌లో చేరండంతో… సన్నిహితులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement