Friday, September 20, 2024

‘క్లైమాక్స్’ కి యు/ఎ సర్టిఫికెట్

క్లైమాక్స్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ఇది. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆయన హీరోగా విభిన్న కథతో విచిత్రపాత్రలు..కథనాలతో భవాని శంకర్..కె.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్లైమాక్స్.   సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని మేకర్స్‌ మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు నటించారు.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ”ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడమే కాకుండా.. అందులో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం చెలరేగింది. ఆ వివాదాలన్నింటికి తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్టే సమాధానం చెప్పేస్తుంది. ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రంపై అంచనాలని అమాంతం పెంచేశాయి. మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకముదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement