China Open | సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పరాజయం

ఇండియా ప్రముఖ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి ఈరోజు చైనా ఓపెన్ 2025 నుండి నిష్క్రమించారు. సెమీఫైనల్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా – సో వూయ్ యిక్‌ల చేతిలో నేరుగా సెట్లలో ఓడిపోయారు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం 13-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది.

మలేషియాకు చెందిన ఆరోన్ చియా – సో వూయ్ యిక్ జోడీ ఇప్పుడు ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్్రీలను ఎదుర్కోనుంది.

Leave a Reply