Thursday, October 24, 2024

TATA | కస్టమర్ కేర్ మహోత్సవ్ ను ప్రారంభించిన టాటా మోటార్స్

హైదరాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ) : వాణిజ్య వాహన వినియోగదారుల కోసం సమగ్ర కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అయిన కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024ను ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్రకటించింది.

ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 24 వరకు నిర్వహించబడనుంది. ప్రత్యేకమైన విలువను పెంచే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500కి పైగా అధీకృత సర్వీస్ అవుట్‌లెట్‌లలో నిర్వహించబడనుంది. కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024 ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ…

కస్టమర్ కేర్ మహోత్సవ్‌ను తిరిగి తీసుకు తీసుకువస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 23న ఇది ప్రారంభమవుతుందన్నారు. తాము తమ మొదటి వాణిజ్య వాహనాన్ని 1954లో ఇదే రోజున విక్రయించినందున తమకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు.

ఇప్పుడు తాము దానిని కస్టమర్ కేర్ డేగా నిర్వహించుకుంటున్నామన్నారు. కచ్చితత్వంతో కూడిన వాహన తనిఖీల ద్వారా, అనేక రకాల ప్రయోజనాలను అందించడం ద్వారా అత్యుత్తమ-తరగతి సేవను అందించాలనే తమ నిబద్ధతను ఈ మహోత్సవ్ ప్రతిబింబిస్తుందన్నారు.

మహోత్సవ్ దేశంలోని ప్రతి టచ్‌పాయింట్‌లో తమ కొనుగోలుదారులను ఆహ్లాద పరిచేలా చేయడం ద్వారా తమ వాటాదారులందరితోనూ తమ సంబంధాలను బలోపేతం చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము తమ కస్టమర్లందరినీ వారి సమీప టాటా అధీకృత సేవా కేంద్రాలకు సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement