Friday, September 20, 2024

HYD: స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్ అండ్ టిఎస్ సిఎస్

హైదరాబాద్: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఇవ్వడంలోని స్ఫూర్తిని పెంపొందించేందుకు విశేష ప్రయత్నంగా, హైదరాబాద్‌లోని తంజీమ్ ఫోకస్ అండ్ తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ (టిఎస్ సిఎస్) ఆధ్వర్యంలో మౌలానా డాక్టర్ అహ్సన్ అల్ హమూమీ సాహబ్ మార్గదర్శకత్వంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అఫ్జల్‌గంజ్ లోని చారిత్రాత్మకమైన ఆసిఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, జరిగిన ఈ శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. దాదాపు 720మంది వాలంటీర్లు రక్తదానం చేశారు.

డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ నేతృత్వంలోని టిఎస్ సిఎస్ అండ్ తంజీమ్ ఫోకస్ బృందాలు కార్యక్రమం విజయవంతం కావడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. ఈసంద‌ర్భంగా మౌలానా డాక్టర్ అహ్సన్ అల్ హమూమీ సాహబ్ మాట్లాడుతూ… మిలాద్ ఉల్ నబీ మానవాళికి కరుణ, సేవ విలువలను బోధిస్తుందన్నారు. రక్తదానం చేయడానికి కలిసి రావడం ద్వారా తాము ఆ విలువలను ప్రతిబింబించామన్నారు. నిజమైన మార్పును తీసుకువస్తున్నామన్నారు. సమాజం నుండి వచ్చిన స్పందన పట్ల సంతోషంగా వున్నామన్నారు.

టిఎస్ సిఎస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ…. ఈ రక్తదాన శిబిరం తలసేమియా అండ్ సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయడంలో సంఘం అంకితభావానికి నిదర్శనమ‌న్నారు. రక్తమార్పిడిపై ఆధారపడే రోగుల జీవితాలను రక్షించడంలో, జీవన నాణ్యతను మెరుగు పరచడంలో ఈ దాతలు అందించిన తోడ్పాటు ప్రశంసనీయమ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement