Friday, October 4, 2024

Stock Market – లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం…..

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.40 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement