Friday, September 6, 2024

Stock Market – లాభాల‌తో స్టాక్ మార్కెట్ ప్రారంభం..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 186 పాయింట్లు పెరిగి 77,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 23,598 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ఆరంభ ట్రేడింగ్‌లోనే సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.34 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement