Monday, June 24, 2024

Stock Market – లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి…

ఉదయం సెన్సెక్స్‌ 192 పాయింట్లు పెరిగి 77,185 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకొని 23,522 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ తొలిసారి 23,500 మైలురాయిని దాటడం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో విప్రో, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

- Advertisement -

మారుతీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement