Friday, October 25, 2024

Stock Market : స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 68 పాయింట్లు పెరిగి 82,163 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24,410 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,738.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కితీసుకుంటూనే ఉన్నారు. ఎఫ్ఐఐలు గురువారం నికరంగా రూ.5,062 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,620 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement