Tuesday, September 17, 2024

Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు…

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 13.65 పాయింట్ల లాభంతో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ వరుసగా రెండో రోజు 25 వేల పైన ముగిసింది.

లాభాప‌డిన‌ షేర్లు ఇవే

నేటి ట్రేడింగ్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి.

న‌ష్ట‌పోయిన షేర్లు ఇవీ

టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement