Friday, September 20, 2024

Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్…

అమ్మకాల ఒత్తిడి పెరగడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 81,908, నిఫ్టీ 24,999 జీవితకాల గరిష్టాలను తాకాయి. చివరికి సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 81,335 వద్ద స్థిరపడగా… నిఫ్టీ 1.25 పాయింట్ల స్వల్ప లాభంతో 24,836 వద్ద ముగిసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.

టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement