Saturday, September 21, 2024

PhonePe | పీజీ బోల్ట్‌ను ఆవిష్కరించిన ఫోన్‌పే పేమెంట్‌ గేట్‌వే

హైదరాబాద్‌ : మర్చంట్లకు మరింత ప్రోత్సాహం అందించేలా ఫోన్‌పే పీజీ బోల్ట్‌ ను ఆవిష్కరిస్తున్నామని ఫోన్‌పే పేమెంట్‌ గేట్‌వే ప్రకటించింది. ఇది 99శాతం విజయాల రేటుతో కస్టమర్లకు అత్యంత వేగవంతమైన పేమెంట్‌ అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది.

ఈసందర్భంగా ఫోన్‌పే పేమెంట్‌ గేట్‌వే అండ్‌ ఆన్‌ లైన్‌ మర్చంట్ల విభాగం హెడ్‌ అంకిత్‌ గౌర్‌ మాట్లాడుతూ… వ్యాపారాలను శక్తివంతం చేసి, వినియోగదారులకు పేమెంట్‌ అనుభవాన్ని మొత్తంగా మెరుగు పరచాలనే తమ ఆశయంలో కీలక మైలురాయిగా నిలిచే ఫోన్‌పే పీజీ బోల్ట్‌ ను ప్రారంభించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు.

నిరంతరాయమైన, సురక్షితమైన పేమెంట్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేసేందుకు అవసరమైన ఉపకరణాలను మర్చంట్లకు అందించడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ వ్యాపారాలకు తగినంత వృద్ధిని, విజయాన్ని ఫోన్‌పే పీజీ బోల్ట్‌ ముందుకు నడిపించగలదనే నమ్మకం తమకుందన్నారు.

నైకా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ రాజేశ్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ… ఫోన్‌పే పీజీ బోల్ట్‌ ఒక నిరంతరాయమైన, వన్‌-క్లిక్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ ను అందిస్తోందన్నారు. ఇది డ్రాప్‌ఆఫ్‌లను పరిష్కరించడంతో పాటు విజయాల రేటును మెరుగు పరుస్తుందన్నారు.

దాంతో పాటు కస్టమర్‌ ప్రయాణాన్ని, వారి సంతృప్తిని కూడా మనం మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నమ్మకమైన సొల్యూషన్‌తో తమ కస్టమర్లకు రీ-టైల్‌ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం తమకు ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement