Tuesday, October 22, 2024

AP: అనంతపురంలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన కళ్యాణ్ జ్యువెలర్స్

అనంతపురం : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ అనంతపురంలో సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున అక్టోబర్ 22 (మంగళవారం) ఉదయం 11:30 గంటలకు సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం, ఈ ఆభరణాల బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప వంటి అన్ని ప్రధాన మార్కెట్‌లతో సహా అనేక ప్రదేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఆభరణాల కలెక్షన్ ల నుండి విస్తృత శ్రేణి డిజైన్‌లు ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ… అనంతపూర్‌లోని సరికొత్త షోరూమ్ ఈ ప్రాంతంలో కంపెనీ మార్కెట్ ఉనికిని పెంచడంలో తమకు సహాయం చేయనుందన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లప్పుడూ ఒక కీలకమైన మార్కెట్ గా వెలుగొందుతుందన్నారు. ఈ ప్రాంతంలో తమ కొత్త పెట్టుబడులు తమ కస్టమర్‌లకు ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కొనసాగించాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement