Friday, October 18, 2024

BSE | నిండా మునిగిన మదుపరులు… నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం, ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలు కూడా మెప్పించకపోవడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 444 పాయింట్లు కుంగి 80,561 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,625 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఇన్ఫోసిస్, నెన్లే ఇండియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్.. ఈ నాలుగు షేర్లు మాత్రమే సెన్సెక్స్ 30 సూచీలో లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.49 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,722 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement