సెప్టెంబర్ 27న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తెలిపింది. ప్రతి సంవత్సరం జరిగే ఈ సేల్లో యథావిధిగా 26వ తేదీకి ఒకరోజు ముందుగా ప్రైమ్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు జరిపే వారికి అదనంగా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సేల్లో అనేక కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ పే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 5 శాతం వరకు క్యాష్బ్యాక్ అందించబడుతుంది.