Friday, October 18, 2024

TS | రంజాన్‌ సందర్భంగా 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు

హైదరాబాద్‌ : రంజాన్‌ మాసం సందర్భంగా పుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీలో 60 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇవి 15 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు, 5.3 లక్షల హలీమ్‌ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.

రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఆర్డర్లలో ఎక్కువగా చికెన్‌, మటన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా, ఫలుదా, ఖీర్‌ ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. జాతీయ స్థాయిలో చూస్తే హలీమ్‌ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్స్‌ 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్‌ 48.40 శాతం ఆర్డర్లు పెరిగినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement