Business| భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్

ముంబై!: దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఈ రోజు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మార్కెట్లు తీవ్ర పరిణామాల్నీ ఎదుర్కొంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులు, ప్రపంచ వ్యాప్తంగా మైనస్ ట్రెండ్‌ను తీసుకొచ్చాయి. గత శుక్రవారం తర్వాత సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్‌లోని మూడు అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం 9.48 గంటలకు బి ఎస్ ఈ BSE సెన్సెక్స్ 81,617 పాయింట్ల వద్ద ట్రేడవుతూ 906 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది నిఫ్టీ. Nifty50 ఇండెక్స్ 24,887 స్థాయిలో ఉంది. ఇది 265 పాయింట్లు పడిపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 351 పాయింట్లు దిగజారింది. .

Leave a Reply