బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల జూన్ 20–21 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో నిర్వహించనున్న Oxford India Forum లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్, “భారత అభివృద్ధికి ఫ్రంటియర్ టెక్నాలజీల పాత్ర” అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆయన తెలంగాణ అభివృద్ధి మోడల్, సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి సాధించిన సమగ్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిన విధానం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం విశిష్ట అభివృద్ధి విధానంతో ప్రపంచంలో అనేక దేశాల దృష్టిని ఆకర్షించగా, ఇప్పుడు ఆ మోడల్ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న కేటీఆర్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.