Bell Company | పాపం యువ‌కుడు..

Bell Company | పాపం యువ‌కుడు..

Bell Company | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని కాసానిగూడెంకు చెందిన ఈడే గిరీశ్ కుమార్ బెల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు.

గిరీశ్ కుమార్ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే తీసుకున్న రుణం కట్టలేకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. దాంతో గిరీశ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bell Company |

Leave a Reply