Sunday, September 8, 2024

Ysrcp – డిల్లీలో జగన్ బృందం – రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం నేటి ఉదయం ఢిల్లీ చేరుకుంది. మూడు రోజుల పర్యటన కోసం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే జగన్‌ ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు.

- Advertisement -

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. రేపటి ధర్నాలో హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement